గత పదేళ్లలో కార్పొరేట్ కంపెనీలు రూ.14 లక్షల కోట్లు ఎగవేశాయని చెప్పారు.

రాష్ట్రంలోని రైతులందరి ఇళ్లల్లో ఇవాళ పండుగ రోజు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు, రుణమాఫీ చేశాం, రెండో విడతగా రూ.6,190 కోట్లు మాఫీ చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రెండో విడత పంట రుణాల మాఫీ నిధుల విడుదల సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. గతంలో అనేక మంది రైతులు సొంత పొలంలోనే పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయారు. ఏ రైతు కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకూడదనేదే మా విధానం. అందుకే ఇవాళ రూ. లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలన్నీ మాఫీ చేశాం. 6.4 లక్షల మంది రైతుల ఖాతాల్లో రెండో విడతగా రూ.6,190 కోట్లు జమ చేసింది. తొలి విడతలో 11.34 లక్షల మంది రైతులకు రూ.6,035 కోట్లు విడుదల చేశారు. ఇప్పటి వరకు 17.75 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. రెండు దశల్లో కలిపి రైతుల ఖాతాల్లో రూ.12,225 కోట్లు జమ చేశారు.
గత పదేళ్లలో కార్పొరేట్ కంపెనీలు రూ.14 లక్షల కోట్లు ఎగవేశాయని చెప్పారు. కానీ, సాగుకోసం బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు తిరిగి కట్టలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ల రుణాలను మాఫీ చేస్తోందని చెప్పారు.

రైతులకు కాంగ్రెస్ పార్టీ భరోసా తుమ్మల

గత ప్రభుత్వంలో పూర్తిగా మూలనపడ్డ పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన మంత్రి… ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామన్నారు. ఒకే పంటకాలంలో రూ.2 లక్షల మేర రుణమాఫీ చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు. ఆయిల్పామ్ సరఫరాలో రాబోయే ఐదేళ్లలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *